ఆర్టీసీ సమ్మెపై మళ్ళీ చర్చలు
హైదరాబాద్ః ఐదురోజుల రామం తరువాత ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం బుధవారం మరో సారి చర్చలు ప్రారంభించింది. సోమవారం నాడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని నిర్ణయించిన దరిులా బుధవారం నాడు ఆర్టీసీ నేతలతో రవాణాశాఖ మంత్రి బి..మోహన్ రెడ్డి, హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ తదితరులు చర్చలు ప్రారంభించారు.
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అవలంబిస్తున్న మొండివైఖరికి నిరసనగా గురువారం నాడు కాంగ్రెస్, వామపక్షాలు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన షయం దితమే. బంద్ జరగడం వల్ల ఆటు కార్మిక వర్గాలు, ఇటు ప్రభుత్వం అప్రతిష్ఠ పాలౌతుందనే ఉద్దేశంతో సమ్మెను రుంపచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం భాస్తున్నది. కార్మికుల జీతాలపెంపు తదితర అంశాలపై కాస్త పట్టుడుపు ధోరణి ప్రదర్శించేదుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తున్నది.