వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టుకోల్పోతున్న తాలిబన్లు!

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః ఆఫ్ఘనిస్తాన్‌ పై అమెరికా యుద్ధ మానాలు బుధవారం నాడు కూడా బాంబుల వర్షం కురిపించాయి. ప్రధాన పట్టణాలపై తాలిబన్లు పట్టు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నార్తరన్‌ అలయెన్స్‌ ఆఫ్ఘనిస్తాన్‌ లోని ప్రధాన పట్టణాలనుస్వాధీనం చేసుకుంటూ మజారే షరీఫ్‌ ను స్వాధీనం చేసుకొనే దిశగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. మంగళవారం నాడు అమెరికా జరిపిన బాంబు దాడుల్లో పదిమంది ఆఫ్ఘన్‌ పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని ఇస్లామాబాద్‌ లో ఆఫ్ఘన్‌ దౌత్యవర్గాలు తెలిపాయి.

ఇదిలా వుండగా పాకిస్తాన్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ బుధవారం నాడు హఠాత్తుగా ఇరాన్‌ పర్యటించారు. టెహరాన్‌ లో ఆయన ఇరాన్‌ అధ్యక్షుడితో రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అమెరికా సందర్శించనున్న ముషారఫ్‌ దారిలో ఇస్తాంబుల్‌, పారిస్‌, లండన్లలో ఆగుతారని పాక్‌ దౌత్య వర్గాలు తెలిపాయి.

మరో వైపు పాకిస్తాన్‌ లో తాలిబన్‌ దౌత్య వర్గాలపై పాక్‌ ప్రభుత్వం ఆంక్షలు ధించింది. చీటికి మాటికి లేకరుల సమావేశం ఏర్పాటు చేయరాదంటూ తాలిబన్‌ దౌత్యవర్గాలను ఇస్లామాబాద్‌ దౌత్యకార్యాలయానికి పిలిపించి పాక్‌ అధికారులు హెచ్చరించారు. పాకిస్తాన్‌ ను కూడా దుయ్యబడుతూ తాలిబన్‌ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు ముషారఫ్‌ కు కోపం తెప్పించాయని,అందుకో ఈ చర్య చేపట్టారని భాస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X