ప్రత్యేక తెంలంగాణాకై కేంద్రంపై వత్తిడి
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకోసం కేంద్రంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో వత్తిడి తీసుకురావాలని తెంలంగాణా ఎమ్మెల్యేల ఫోరం నిర్ణయించింది. బుధవారం నాడు హైదరాబాద్లో సమావేశమైన తెలంగాణా ఎమ్మెల్యేల ఫోరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం అనుకూలంగా వున్నట్టు తెలంగాణా ఎమ్మెల్యేల ఫోరం భాంచింది.
ఈ నేపద్యంలో ఎన్.డి.ఏ ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తీసుకువచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించాలని కాంగ్రెస్ శాసనసభ్యులు నిర్ణయించారు. అలాగే, తెలంగాణాకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కుటీని ఏర్పాటు చేయాలని తెలంగాణా ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీల ద్వారా ప్రత్యేక తెలంగాణాను సాధించటం అసాధ్యమని, జాతీయపార్టీల ద్వారానే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సాధించటం సాధ్యమవుతుందని తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయ పడ్డారు.