వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః కాంగ్రెస్‌ పార్టీని జనం పట్టించుకోవడం మానేశారని హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ చెప్పారు. శనివారం నాడు ఎన్‌టిఆర్‌ భవన్‌లో కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన 14 నియోజకవర్గాల తెలుగుదేశం నేతల శిక్షణ తరగతులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.

By Staff
|
Google Oneindia TeluguNews

వరసగా చేపడుతున్న నియోజకవర్గ స్థాయి నేతల శిక్షణాశిబిరాల్లో ఇది మూడోది. కాంగ్రెస్‌ నేతలు అదేపనిగా తెలుగుదేశం పార్టీని మర్శిస్తూ కాలం గడుపుతున్నారని వారికి మరో పని లేకుండా పోయిందని దేవేందర్‌గౌడ్‌ అన్నారు. తెలుగుదేశంపై దుమ్మెత్తిపోయడం మాని సొంతపార్టీ బలం పెంచుకోవడానికి కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. పరిపాలనలో తెలుగుదేశం పార్టీ ఒక కొత్త వరవడి సృష్టించిందని ఆయన చెప్పారు. పాలనను ప్రజలకు మరింత చేరువగా తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన చెప్పారు. పార్టీ సేవలను ప్రజలకు వరించి కాంగ్రెస్‌ ఇతర పక్షాలు చేసే దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నాయకులను దేవేందర్‌గౌడ్‌ కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X