గుంటూరుః గుంటూరు జిల్లా నర్సారావుపేటలోని ఒక కాలేజీపై పీపుల్స్వార్ నక్సలైట్లు శనివారం నాడు ఉదయం దాడి జరిపి 20 తుపాకులు అపహరించుకుపోయారు. ఎన్సిసి ద్యార్ధుల శిక్షణ కోసం ఈ తుపాకులను కాలేజీలోని ఎన్సిసి భాగంలో వుంచారని తెలిసింది.
సుమారు 20 మంది నక్సల్స్ కాలేజీపై దాడి జరిపినట్టుగా పోలీసులు చెప్పారు. దాడి జరిపిన నక్సల్స్లో మహిళలు కూడా వున్నారు. ఈ సంఘటనపై కాలేజీ యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
