హోమ్ పేజి
హైదరాబాద్ః రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి హైవే అథార్టీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం హోం మంత్రి దేవేందర్ గౌడ్ మంగళవారం నాడు వెల్లడించారు.
రాష్ట్రంలోని రహదారులపై తిరిగే వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయిందని ఏటా కనీసం రెండు లక్షల కొత్త వాహనాలు వచ్చి చేరుతున్నాయని ఆయన చెప్పారు. ర సిడిఆర్ ఆస్పత్రి ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ట్రాఫిక్ మానేజ్మెంట్ సమర్ధవంతంగా వుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టుగా దేవేందర్గౌడ్ చెప్పారు. ట్రాఫిక్ మానేజ్మెంట్ గాడి తప్పడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కొత్త సర్వీసు కింద జంటనగరాల్లోని వేరువేరు ప్రాంతాల్లో మూడు ప్రత్యేక అంబులెన్స్ వాహనాలనువుంచునున్నట్టుగా సిడిఆర్ తెలిపింది. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రాధమిక వైద్య సాయం అందించి ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు ఈ అంబులెన్స్లో వున్నాయి.