వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదిలాబాద్‌ బాలునికి సాహస అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌ః జాతీయ సాహసబాలురకు ఇచ్చే అవార్డుకు తొలిసారిగా ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఒక బాలుడు ఎన్నికయ్యాడు. ప్రఖ్యాత సందర్శనీయ స్థలం కుంటాల జలపాతంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని తన ప్రాణల్ని సైతం లెక్కచేయకుండా సోమేశ్వర్‌ కాపాడాడు.

ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న సోమేశ్వర్‌ జలపాతం వద్ద చేపలు పట్టేవాడు. జులై 29న బెల్లంపల్లికి చెందిన ఆరుగురు యువకులు జలపాతంలో స్నానం చేస్తూ ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రవాహం మధ్యలో వున్న బండరాళ్ల మధ్య చిక్కుకున్నారు.

వారి కేకలు విన్న సోమేశ్వర్‌ ఈదుతూ వెళ్లి వారిని ఒక్కక్కరినీ మరో సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. ఆ తర్వాత పావుగంటలోనే ప్రవాహం మరింత తీవ్రం కావడంతో అప్పటివరకు వారున్న ప్రదేశం కూడా మునిగిపోయింది. ఈ లోపు సోమేశ్వర్‌ కేకలు వున్న సమీపంలోని కుంటాల గ్రామస్తులు వచ్చి తాళ్ల సహాయంతో వారిని కాపాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X