హైదరాబాద్: ప్రముఖస్వాతంత్ర్య సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావు బుధవారం ఇక్కడ కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 89 ఏళ్లు.
హైదరాబాద్స్టేట్లో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. నిజాం సంస్థానాన్ని భారతదేశంవిలీనం చేయడానికి చేసిన కృషికి గాను ఆయనను వందేమాతరంపేరుతో గౌరవిస్తూ వస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వందేమాతరం రెండు సార్లు జైలు శిక్ష అనుభవించారు. రాష్ట్ర శాసనసభకు ఆయన రెండుఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
వందేమాతరం రామచంద్రరావు భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications
