రోడ్డు ప్రమాదంలో న్యాయవాదుల మృతి
హైదరాబాద్ః హైదరాబాద్కు చెందిన ముగ్గురు హైకోర్టు న్యాయవాదులు శనివారం నాడు మెదక్జిల్లా రాజీవ్ రహదారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
కారు-ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మెదక్జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోమురవెల్లి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ముగ్గురు న్యాయవాదులు సిద్దిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే వారిని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని పోలీసులు తెలిపారు












Click it and Unblock the Notifications
