వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ పై దారికొచ్చిన బ్లెయిర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః కాశ్మీర్‌ వివాదాస్పద అంశమేనని, ఈ అంశంపై పాక్‌ వాదన సమర్థనీయమంటూ శుక్రవారం వివాదస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన బ్రిటన్‌ అధినేత టోనీ బ్లెయిర్‌ మాట మార్చారు. తీవ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్‌ మరిన్న చర్యలు తీసుకోవాలంటూ శనివారం బెంగుళూరులో జరిగిన సదస్సులో బ్లెయిర్‌ స్పష్టం చేశారు. భారత్‌ పార్లమెంటుపై జరిగిన దాడి తీవ్రమైనదని బ్లెయిర్‌ అన్నారు. బెంగుళూరులో వాణిజ్యవర్గాల సదస్సులో బ్లెయిర్‌ ప్రసంగించారు. బ్లెయిర్‌ ప్రసంగంలో పాక్‌ తీవ్రవాదమే ప్రధానం అంశంగా మారింది.

పాక్‌ కు వత్తాసు పలుకుతూ బ్లెయిర్‌ చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొనేట్లు వున్నాయి. భారత్‌ - పాక్‌ ల మధ్య దౌత్యం నిర్వహించాల్సిందిగా ముషారఫ్‌ బ్లెయిర్‌ ను కోరనుంది. భారత్‌ పర్యటన అనంతరం బ్లెయిర్‌ పాక్‌ లో పర్యటిస్తారు. ఆ సందర్భంగా బ్లెయిర్‌ ను ప్రసన్నం చేసుకోవాలని పాక్‌ ఆలోచిస్తున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X