వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ కు భారత్‌ డిమాండ్ల జాబితా!

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః భారత-పాక్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు పాకిస్తాన్‌ తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ భారత్‌ కొన్ని పత్రాలను పాక్‌ కు అందజేసింది. భారత భద్రతావ్యవహారాల సలహాదారు బ్రిజేష్‌ మిశ్రా సోమవారం ఈ పత్రాలను పాక్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ కు అందజేశారు. సార్క్‌ శిఖరాగ్రం సందర్భంగా బ్రిజేష్‌ మిశ్రా ఈ పత్రాలను పాక్‌ కు అందజేసినట్లు ది నేషన్‌ పత్రిక వెల్లడించింది.

సార్క్‌ శిఖరాగ్రం ముగింపు సందర్భంగా మిశ్రా, అబ్దుల్‌ సత్తార్‌ తో మంతనాలు జరపడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇదిలా వుండగా భారత్‌ కోరిన 20 మంది నేరస్తులలో కొందరిని అప్పగించే విషయాన్ని పాకిస్తాన్‌ పరిశీలిస్తున్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. భారత్‌ కోరిన వారెవరినీ అప్పగించే ప్రసక్తి లేదని పాక్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే. అయితే పంజాబ్‌ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ హంతకులతో పాటు ఖాట్మండూ విమానాన్ని హైజాక్‌ చేసిన వారిలో కొందరు సిక్కులను భారత్‌ కు అప్పగించి చేతులు దులుపుకోవాలని పాక్‌ యోచిస్తున్నట్లు ఆ పత్రిక రాసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X