వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోల్ కతా నిందితుడు దుబాయ్ లోఅరెస్టు
న్యూఢిల్లీః కోల్ కతాలో అమెరికాసెంటర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడైనఅఫ్తాబ్ అన్సారీ అలియాస్ ఫరాన్ మాలిక్ ను దుబాయ్ లోఅరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఆఫ్తాబ్ ను శనివారం కొత్తఢిల్లీకి తీసుకువచ్చారు.అఫ్తాబ్ తో పాటు మరో నిందితుడు రాజీందర్ ను సిబిఐ బృందం కొత్తఢిల్లీకి తీసుకువచ్చినట్లు సిబిఐ డైరెక్టర్ శర్మ తెలిపారు. ఈ ఇద్దరిని పట్టుకొనేందుకు ఢిల్లీ నుంచి సిబిఐ బృందం కొద్ది రోజుల కిందటే దుబాయ్ వెళ్ళినట్ల శర్మ చెప్పారు. శనివారం సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలోవీరిద్దరినీ కొత్తఢిల్లీకి తీసుకువచ్చారు.
కీలకమైన ఈ వ్యవహారంలో సిబిఐ అతి తక్కువ సమయంలో నిందితులనుఅరెస్టు చేయడం విశేషం. అమెరికా ఇన్ఫర్మేషన్సెంటర్ పై దాడి కేసుకే సంబంధించి మరో ముగ్గురు అనుమానితుల్ని కూడా కోల్ కతాలో శుక్రవారంఅరెస్టు చేశారు.
ఇదిలా వుండగా బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య శనివారం కొత్తఢిల్లీ వచ్చి రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీతో చర్చలు జరిపారు.
Comments
Story first published: Saturday, February 9, 2002, 23:53 [IST]