వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌ కతా నిందితుడు దుబాయ్‌ లోఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కోల్‌ కతాలో అమెరికాసెంటర్‌ పై దాడి కేసులో ప్రధాన నిందితుడైనఅఫ్తాబ్‌ అన్సారీ అలియాస్‌ ఫరాన్‌ మాలిక్‌ ను దుబాయ్‌ లోఅరెస్టు చేశారు. దుబాయ్‌ నుంచి ఆఫ్తాబ్‌ ను శనివారం కొత్తఢిల్లీకి తీసుకువచ్చారు.అఫ్తాబ్‌ తో పాటు మరో నిందితుడు రాజీందర్‌ ను సిబిఐ బృందం కొత్తఢిల్లీకి తీసుకువచ్చినట్లు సిబిఐ డైరెక్టర్‌ శర్మ తెలిపారు. ఈ ఇద్దరిని పట్టుకొనేందుకు ఢిల్లీ నుంచి సిబిఐ బృందం కొద్ది రోజుల కిందటే దుబాయ్‌ వెళ్ళినట్ల శర్మ చెప్పారు. శనివారం సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలోవీరిద్దరినీ కొత్తఢిల్లీకి తీసుకువచ్చారు.

వీరిద్దరి అరెస్టులో యునైటెడ్‌అరబ్‌ ఎమిరైట్స్‌ ప్రభుత్వం భారత్‌ కు పూర్తి సహకారంఅందించిందని ప్రధాని వాజ్‌ పేయి మీరట్‌ లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ చెప్పారు. కోల్‌ కతాలో కాల్పులు జరిపిన ఆఫ్తాబ్‌ మొదట పాకిస్తాన్‌ పారిపోయారని ఆ తరువాత దుబాయ్‌ లో పట్టుపడ్డాడని వాజ్‌పేయి చెప్పారు.
కీలకమైన ఈ వ్యవహారంలో సిబిఐ అతి తక్కువ సమయంలో నిందితులనుఅరెస్టు చేయడం విశేషం. అమెరికా ఇన్ఫర్మేషన్‌సెంటర్‌ పై దాడి కేసుకే సంబంధించి మరో ముగ్గురు అనుమానితుల్ని కూడా కోల్‌ కతాలో శుక్రవారంఅరెస్టు చేశారు.

ఇదిలా వుండగా బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య శనివారం కొత్తఢిల్లీ వచ్చి రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీతో చర్చలు జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X