వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం కావాలో పాక్‌ తేల్చాలిః వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

మీరట్‌ః భారత్‌ తో విరోధాన్ని వదులుకొని శాంతియుతంగా బతకాలనుకుంటున్నారో లేదో పాకిస్తాన్‌ తేల్చుకోవాలని ప్రధాని వాజ్‌ పేయి పిలుపునిచ్చారు. పాకిస్తాన్‌ తో శతృత్వాన్ని భారత్‌ వదులుకుంది.... అలా కాదని పొరుగుదేశం (పాకిస్తాన్‌) దుస్సాసహసానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పక తప్పదని వాజ్‌ పేయి హెచ్చరించారు. మీరట్‌ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో వాజ్‌ పేయి ఆవేశపూరితంగా మాట్లాడారు.

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకే భారత్‌సేనలు సరిహద్దు వద్ద మొహరించాయని వాజ్‌పేయి చెప్పారు. పాకిస్తాన్‌ తో శాంతియుతంగా మెలగాలన్నదే భారత్‌ లక్ష్యం అయితే ఎవరో ఒకరి అనుకున్నంత మాత్రాన అది సాధ్యం కాదని వాజ్‌పేయి అన్నారు. కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ పరాజయంపాలైందని, వాస్తవాధీన రేఖ దాటకుండానే కార్గిల్‌ ను భారత్‌ తిరిగి సొంతం చేసుకుందని ఆయన అన్నారు. ఆయుధాలపై అనవసరంగా ఖర్చుచేయడం తగదని తెలిసినప్పటికీ దేశ రక్షణ దృష్ట్యా అది తప్పడం లేదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X