వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే లైన్‌ను పేల్చేసిన తీవ్రవాదులు

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసిసి) తీవ్రవాదులు బుధవారం తెల్లవారు జామున జార్ఖండ్‌లోని గిరిదిహ్‌ జిల్లాలో ఒక రైల్వే లైన్‌ను పేల్చివేశారు. దీంతో ఒక రైలు 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రకంగా తీవ్రవాదులు తలపెట్టిన బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల 24 గంటల బంద్‌ హింసాత్మక చర్యలతో మొదలైంది.

ప్రశాంత్‌ స్టేషన్‌ వద్ద కొన్ని మీటర్ల రైల్వే ట్రాక్‌ను తీవ్రవాదులు పేల్చివేశారు. దీంతో హతియా-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ 12 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రాణనష్టమేదీ సంభవించలేదు.

ఇదిలా వుండగా, తీవ్రవాద నిరోధక ఆర్డినెన్స్‌ (పొటో)కు వ్యతిరేకంగా తీవ్రవాదులు తలపెట్టిన బంద్‌కు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. గస్తీని ముమ్మరం చేశారు.

పొటో కింద ఇటీవలే నిషేధానికి గురైన పీపుల్స్‌వార్‌ ఈ బంద్‌కు తన మద్దతు ప్రకటించింది. ఎంసిసి బంద్‌ బీహార్‌కు మాత్రమే పరిమితమైనట్లు వార్తలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X