వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాస్‌ సెంచరీ: పటిష్ట స్థితిలో భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

నాగపూర్‌: జింబాబ్వేతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ శివసుందర్‌ దాస్‌సెంచరీతో పటిష్టమైన స్థితికి చేరుకుంది. రెండువికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.

శివసుందర్‌ దాస్‌ టెస్టులో రెండవసెంచరీని నమోదు చేసుకున్నాడు. ఎస్‌ఎస్‌ దాసు తొలిసెంచరీని కూడా ఇదే మైదానంలో సాధించాడు. ద్రావిడ్‌తో కలిసి దాస్‌ రెండోవికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. దాస్‌ 19 బౌండరీలతో 105 పరుగులు చేశాడు.

రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ద్రావిడ్‌ 57 పరుగులతో, సచిన్‌ టెండూల్కర్‌ పరుగులేమీ చేయకుండా క్రీజ్‌లో వున్నారు.

అంతకు ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లన్నీ కోల్పోయి 287 పరుగులు చేసింది. ఎనిమిదివికెట్లకు 248 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో శుక్రవారం జింబాబ్వే ఆట ప్రారంభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X