ఆజంజాహీ పునరుద్ధరణకు చర్యలు: బాబు
వరంగల్: వరంగల్ జిల్లాలోని ఆజంజాహీమిల్లు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఈవిషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని,అందుకే ఆస్తులను సంరక్షిస్తున్నామని ఆయన చెప్పారు. తొంబై కోట్ల రూపాయలతో నిర్మించిన రాయపట్నం- వరంగల్ జాతీయ రహదారిని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయనమాట్లాడారు.
పర్యాటక కేంద్రంగా మేడారం
మేడారంను కోటిన్నర రూపాయల వ్యయంతో పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 1.97 కోట్ల రూపాయల వ్యయంతో 37 రోజుల రికార్డు సమయంలో నిర్మించిన జంపన్నవాడు వంతెనను ఆయన ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణాన్ని నక్సల్స్ పది రోజులు ఆటంకపరిస్తే వారిని మహిళలు వారిని ఎదిరించి పూర్తి చేయడంలో తోడ్పడినందుకు ఆయన మహిళలను అభినందించారు. ఈ వంతెన నిర్మాణం వల్ల మేడారంకే కాకుండా రెడ్డి గూడెం, కొత్తూరు, తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications
