వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్‌ సెంచరీ: భారత్‌ 437/5

By Staff
|
Google Oneindia TeluguNews

నాగపూర్‌:జింబాబ్వేతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ పటిష్టమైన స్థితికి చేరుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ ఐదువికెట్ల నష్టానికి 437 పరుగులు చేసింది. 209 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం ఆట ప్రారంభించిన భారత్‌ మరో మూడువికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోర్‌ సాధించింది. దీంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌పై భారత్‌ 150 పరుగుల ఆధికత్యను సాధించింది.

శనివారం ఆట ముగిసే సమయానికి సచిన్‌ టెండూల్కర్‌ 137 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. అద్భుతమై షాట్లతో టెండూల్కర్‌సెంచరీ సాధించాడు. సంజయ్‌ బంగర్‌ 22 పరుగులతో క్రీజ్‌లో వున్నాడు. శనివారం రాహుల్‌ ద్రావిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌ తమ ఆటను కొనసాగించారు. రాహుల్‌ ద్రావిడ్‌ 65 పరుగులకు హీత్‌స్ట్రీక్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ కొన్ని మెరుపు షాట్లు కొట్టినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్‌ వద్ద నిలబడలేకపోయాడు. గంగూలీ 38 పరుగులకురే ప్రైస్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత వి.వి.యస్‌. లక్ష్మణ్‌ మందకోడిగా ఆడాడు. అతను 13 పరుగులు మాత్రమే చేసి ప్రైస్‌ బౌలింగ్‌లోపెవిలియన్‌ దారి పట్టాడు. ఆ తర్వాత సంజయ్‌ బంగర్‌ బ్యాటింగ్‌కు దిగి టెండూల్కర్‌కు తోడుగా నిలిచాడు. శుక్రవారం రెండు భారతవికెట్లను కూల్చిన జింబాబ్వే స్పిన్నర్‌ ప్రైస్‌ శనివారం మరో రెండు ప్రధానవికెట్లు తీసుకున్నాడు. ప్రైస్‌ తప్ప భారత బ్యాట్స్‌మెన్‌పై మరే జింబాబ్వే బౌలర్‌ కూడాపెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X