చేతులెత్తేసిన రాజ్నాథ్సింగ్
లక్నోః ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించిన పెద్దపార్టీగా అవిర్భవించింది. అయితే నేరుగా వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన బలాన్ని సమకూర్చుకోవడానికి ఎస్పి నేతలు ఒకటి రెండు వారాల గడవు కోరే అవకాశం వుంది. ఆదివారం సాయంత్రం వరకు వెల్లడయిన ఫలితాల బట్టి బిజిపి కూటిమి ద్వితీయ స్థానంలో వుంది.
ప్రకటించారు. పార్టీ అధిష్టాన వర్గం చెప్పిన ప్రకారం భవిష్యత్ పాత్రను నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వంటిపెద్ద రాష్ట్రంలో ఏడాది కాలంలో పరిస్థితిని మార్చడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా రాజ్నాథ్ సింగ్ ఓటమిని ఒప్పుకున్నప్పటికీ 89 స్థానాలతో మూడో స్థానంలో వున్న బిఎస్పిని తమవైపు తిప్పుకుంటే అధికారాన్ని ఎస్పి పరం కాకుండా ఆపవచ్చనే అభిప్రాయం బిజెపి నేతల్లో వుంది.అందువల్ల బిఎస్పి నేతలతో వారు ముమ్మరంగా మంతనాలు సాగిస్తున్నారు. మరోవైపు ఏలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు కోసం ఎస్పి నేతలు కూడా వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. వివిధ పార్టీల నేతలతో ఎస్పి అధినేత ములాయం సింగ్ యాదవ్ మంతనాలు జరుపుతున్నారు. ఆఖరు క్షణం వరకు యుపి కొత్త సర్కారు గురించే ఏమీ చెప్పడానిక లేదని పరిశీలకులుఅంటున్నారు. బిజెపి అండతో మాయావతి గద్దెనెక్కినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని వారుఅంటున్నారు.












Click it and Unblock the Notifications
