వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామాలయానికిముహూర్తం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్యలో మార్చి 15 నాడు ఆలయ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని,విగ్రహాలను తరలించేందుకు విశ్వహిందూ పరిషత్‌ ముహూర్తం నిర్ణయించింది.విశ్వహిందూ పరిషత్‌ ను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటామని ప్రధాని వాజ్‌పేయి ప్రతిపక్షాలకు హామీ ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందు వి.హెచ్‌.పి. ముహూర్తాన్ని ప్రకటించడంవిశేషం. మార్చి 15 మధ్యాహ్నం 2.15 గంటలకు విగ్రహాలను, శిల్పాలను, నిర్మాణ సామగ్రిని తరలించడం ప్రారంభిస్తామనివిశ్వహిందూ పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఆచార్య గిరిరాజ్‌ కిషోర్‌ బుధవారం కొత్తఢిల్లీలో ప్రకటించారు.
ఆలయ నిర్మాణానికి ఇప్పటికే వేలాది మంది కరసేవకులు అయోధ్య చేరుకున్నారు.

ఉద్రిక్తతల మధ్య అయోధ్యలో రామాలయం నిర్మించాలన్నది తమ అభిమతం కాదని, సామరస్య పరిస్థితుల మధ్య మాత్రమే ఆలయాన్ని నిర్మించాలన్నది తమ అభిమతం అని గిరిరాజ్‌ కిషోర్‌ అన్నారు. మార్చి 15 లోపే ప్రభుత్వం ఈవివాదానికి సామర్య పూర్వక పరిష్కారాన్ని ప్రభుత్వం సూచించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X