వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేనేత కార్మికుల చావులు పట్టని ప్రభుత్వం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ లో గత ఏడాది కనీసం 200 మంది చేనేత కార్మికులు ఆకలితో ఆత్మహత్యలకు పాల్పడ్డారని అయినా ప్రభుత్వం వారి సంక్షేమానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే చేనేత రంగం ఈ దుస్థితికి చేరుకున్నదని మంత్రి పడాల భూమన్న కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకు పడ్డారు. ప్రతిపక్షాలు ఇందుకు నిరసన వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపు రభస నెలకొన్నది.

1995 బడ్జెట్‌ లో చేనేత కార్మికలు సంక్షేమానికిఅప్పటి ప్రభుత్వం 140 కోట్ల రూపాయలు కేటాయిస్తే తెలుగుదేశం ప్రభుత్వం గతబడ్డెట్‌ లో దానిని 10 కోట్ల రూపాయలు చేసిందని, తాజాబడ్జెట్‌ లో ఆ కేటాయింపును 30 కోట్లకు పెంచి రెండు వందల శాతం కేటాయింపుపెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారని వై.ఎస్‌. ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం తెలుగుదేశం ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా చేనేత కార్మికులను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నదనివిమర్శించారు. చేనేత కార్మికలు సంక్షేమ కోసం పలు చర్యలు చేపట్టామంటూ మంత్రి పడాలభూమన్న సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి సమాధానం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదంటూ కాంగ్రెస్‌ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X