వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సజ్జాత్‌ ఆగాది ఆత్మహత్యే!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చార్మినార్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ సజ్జాత్‌ ఆగాది ఆత్మహత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆగా మృతదేహానికి పోస్టు మార్టం జరిగినవిషయం తెలిసిందే.

వేయి రూపాయల చొప్పున చెల్లిస్తామని అధికారులు ప్రకటించడంతో చార్మినార్‌ బ్యాంక్‌ శాఖల ముందు ఖాతాదారులు బారులు తీరారు. గురువారం వేయి రూపాయల చొప్పున,మిగతా సొమ్ము తర్వాత చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. లక్షల రూపాయలు డిపాజిట్‌ చేసిన ఖాతాదారులు సైతం వేయి రూపాయల కోసం క్యూలో నిల్చున్నారు. కొన్ని శాఖలను తెరవకపోవడంతో అక్కడ గుమిగూడిన ఖాతాదారులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.

తాకట్టు రుణాలు తీసుకున్నవారు చెల్లింపులకు ముందుకు వస్తున్నారని, దీంతో బ్యాంక్‌పరిస్థితి మెరుగయ్యే అవకాశం వున్నదని, లక్ష రూపాయల లోపు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని చార్మినార్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నక్వీ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X