వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహసోపేతబడ్జెట్‌: ప్రధాని కితాబు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం నెలకొన్నప్పటికీ 2002-03బడ్జెట్‌ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా సాహసోపేతబడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రశంసించారు. ఆర్థిక సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం చూపబోవని, ఉద్యోగావకాశాలను మెరుగు పరుస్తామని ఆయన గురువారం అన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో సామాన్య ప్రజలపై కొంత భారం వేయాల్సి వచ్చిందని, దీన్ని వారుఅంగీకరిస్తారనే నమ్మకం తనకు ఉన్నదని ఆయన అన్నారు.

ఆర్థిక సంస్కరణలు అనివార్యమని, కానీ అభివృద్ధి కార్యక్రమాలుదెబ్బ తినకుండా చూస్తామని, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి సరిజోడుగా ముందుకు సాగేందుకుబడ్జెట్‌ ప్రతిపాదనలు గ్యారంటీ ఇస్తాయని ఆయన అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగానే ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నదని, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్‌, రోడ్ల నిర్మాణ రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూబడ్జెట్‌ ఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదం చేస్తుందని ప్రధాని అన్నారు. గరీబీ హటావో అనేది నినాదప్రాయంగానే మిగలకుండా వాస్తవరూపం దాలుస్తుందని ఆయన ప్రశంసించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X