మధ్యవర్తిత్వానికి ఆర్ఎస్ఎస్అంగీకారం
న్యూఢిల్లీ: అయోధ్యవివాదంపై ప్రభుత్వానికి, విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి)కి మధ్య మధ్యవర్తిత్వానికి రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంగీకరించింది. ఆర్ఎస్ఎస్ నేతలు గురువారం సాయంత్రం ప్రధాని అటల్బిహారీ వాజ్పేయితో దాదాపు గంటన్నర సేపు సమావేశమయ్యారు.
పరిష్కారానికి ఇరు వైపుల నుంచి కృషి జరగాలని, తాము విహెచ్పి నేతలతో మాట్లాడుతామని, వాజ్పేయి కూడా వారితోమాట్లాడుతారని, దేశంలో శాంతి భద్రతలను పరిష్కరించడమే తమ తక్షణ కర్తవ్యమని ఆర్ఎస్స్ సంయుక్త ప్రధాన కార్యదర్శి, బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జి మదన్ దాస్ దేవివిలేకరులతో అన్నారు.












Click it and Unblock the Notifications
