వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

450కి చేరిన గుజరాత్‌ మృతులు

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః మతఘర్షణలు చెలరేగిన గుజరాత్‌ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా మతఘర్షణలు చెలరేగాయి. అయితే పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందని గుజరాత్‌ ముఖ్యంత్రి నరేంద్ర మోడి అన్నారు. మృతుల సంఖ్య ఆదివారం నాటికి 450కి చేరింది.

అహ్మదాబాద్‌ లో మరణించిన వారి సంఖ్యే అత్యధికంగా 213కుపెరిగింది. నగరశివార్లలోని నరోడా, బాపూనగర్‌ లో మతఘర్షణలకు కాలిబూడిదైన ఇళ్ళ నుంచి మరిన్ని మృత దేహాలను పోలీసులు ఆదివారం కనుగొన్నారు. దీనితో అహ్మదాబాద్‌ లో మృతులసంఖ్య భారీగాపెరిగింది. వివిధ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లోనే కనీసం 73 మంది మరణించారంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా వుందోఅర్థం చేసుకోవచ్చు. ఉత్తర, దక్షణ, మధ్య గుజరాత్‌ లోని మారు మూల గ్రామాల్లో తాజాగా ఘర్షణలు చెలరేగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. శనివారంరాత్రి బనస్‌ కాంత జిల్లా దియోదర్‌ గ్రామంలో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. పోలీసులు కాల్పుల్లో మరోఇద్దరు మరణించారు.అసాలి గ్రామంలో పది ట్రక్కులను అల్లరి మూకలు తగలబెట్టాయి. అహ్మదాబాద్‌ లో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X