వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమలాపురం చేరిన బాలయోగి భౌతికకాయం

By Staff
|
Google Oneindia TeluguNews

అమలాపురంః హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణంపాలైన లోక్‌ సభ స్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం కొత్తఢిల్లీ నుంచి అమలాపురం చేర్చారు. సోమవారం వేకువజామున హైదరాబాద్‌ నుంచి కొత్తఢిల్లీ తరలించి బాలయోగి భౌతిక కాయాన్ని పార్లమెంటు భవనప్రాంగణంలో వుంచారు. ప్రధాని, రాష్ట్రపతి, వందలాది మంది ఎం.పి.లు, ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులుఅర్పించారు. సాయంత్రం బాలయోగి భౌతిక కాయాన్ని ప్రత్యేకవిమానంలో రాజమండ్రి తరలించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక వాహనంలో దివంగత నేతను అమలాపురం తరలించారు.

కోనసీమ కష్టాన్ని తన కష్టంగా భావించే బాలయోగి శవంగా మారిస్వస్థలానికి చేరుకోవడంతో అమలాపురం ప్రజలు శోకతప్త హృదయులయ్యారు. మంగళవారంఅంతా బాలయోగి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం వుంచుతారు. బుధవారం నాడు అంత్యక్రియలు జరుగుతాయి. బాలయోగి అంత్యక్రియలకు ప్రధాని వాజ్‌పేయి తరలి రానున్నారు. బాలయోగి అంత్యక్రియల సందర్భంగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వంసెలవు ప్రకటించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X