వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయ నిర్మాణం ఆగదుః వి.హెచ్‌.పి.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్యలో ఆలయనిర్మాణ ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రధాని వాజ్‌పేయి చేసిన విజ్ఞప్తిని విశ్వహిందూ పరిషత్‌ త్రోసిపుచ్చింది. మార్చి 15 నుంచి అయోధ్యలోనివివాదాస్పద స్థలానికి నిర్మాణ సామగ్రిని తరలిస్తామని సోమవారం కొత్తఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వి.హెచ్‌.పి. స్పష్టం చేసింది. ఆలయ నిర్మాణ ప్రక్రియలో భాగంగా వి.హెచ్‌.పి. చేపట్టిన 100 రోజుల యజ్ఞంజూన్‌ 2కు ముగుస్తుంది కాబట్టి ఆ రోజుకల్లా అయోధ్య లోనివివాదాస్పద స్థలాన్ని తమకు అప్పగించాలని తీర్మానించింది.

మార్చి 12 నాటికి వేల సంఖ్యలో అయోధ్య చేరుకొనే రామసేవకులకు ప్రభుత్వం ఎటువంటి అవాంతరాలు కల్పించరాదనివిశ్వహిందూ పరిషత్‌ నేత అశోక్‌ సింఘాలు, రామ జన్మభూమిట్రస్ట్‌ అధ్యక్షుడు మహంత్‌ పరమహంస రామచంద్ర దాస్‌కోరారు. గుజరాత్‌ అల్లర్ల నేపధ్యంలో అయోధ్య వ్యవహారాన్ని, నిర్మాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రధాని వాజ్‌పేయి చేసిన విజ్ఞప్తిని చర్చించేందుకు వి.హెచ్‌.పి. మత సంస్థల నేతలో సంకట్‌ మోక్ష ఆశ్రమంలో సోమవారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. బిజెపిఎం.పి. స్వామి చిన్మయానంద కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై మతసంస్థల నేతలంతా కలిసి ప్రధాని వాజ్‌పేయిని కలుసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X