వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎదుర్లంక బ్రిడ్జికి బాలయోగిపేరు

By Staff
|
Google Oneindia TeluguNews

అమలాపురంః యానాం-ఎదుర్లంక బ్రిడ్జికి దివంగత లోక్‌ సభ్‌ స్పీకర్‌ బాలయోగి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ లో నిర్మిస్తున్న స్పోర్ట్స్‌ విలేజ్‌ కు కూడా బాలయోగి పేరు పెడతారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఎదుర్లంకలో గానీ, అమలాపురంలో గానీ బాలయోగి పేరిట ఓ మెమోరియల్‌ ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

యానాం-ఎదుర్లంక బ్రిడ్జి ఆ ప్రాంత ప్రజలకు బాలయోగి ఇచ్చిన వరం. ఆ బ్రిడ్జి నిర్మాణం వల్ల పరిసరాల్లోని 12 గ్రామాల ప్రజలు పట్టణానికి సులువుగా రాకపోకలు సాగించే అవకాశం వుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రధాని వాజ్‌పేయిని ఆహ్వానించాలని బాలయోగి అనుకొనే వారు. విధి వక్రించడంతో ప్రధాని వాజ్‌పేయి బాలయోగి అంత్యక్రియలకు అమలాపురం రావాల్సి వచ్చింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X