వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వి.హెచ్‌.పి దారికొచ్చిందన్న జయేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్య వ్యవహారంలోవిశ్వహిందూ పరిషత్‌, రామజన్మభూమి ట్రస్ట్‌ దారికొచ్చాయని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి మంగళవారం కొత్తఢిల్లీలో ప్రకటించారు.వివాదాస్పద స్థలం విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకు ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా వుండేందుకువిశ్వహిందూ పరిషత్‌ అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.

వివాదాస్పద స్థలం సమీపంలో వున్నవివాద రహిత స్థలంలో రామమందిర నిర్మాణం పనులు చేపట్టేందుకు అనుమతిస్తే కోర్టు తీర్పు వచ్చే వరకువివాదాస్పద స్థలంలో నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనను వాయిదా వేసుకుంటామని వారుఅంగీకరించినట్లు జయేంద్ర చెప్పారు. వివాదరహిత స్థలంలో శిలాన్యాస జరుపుకొనేందుకు ప్రభుత్వానికి ఎటువంటి న్యాయపరమైన ఇబ్బంది వుండదని కూడా జయేంద్ర అన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం 21 పార్టీల ఎన్డీఏ కూటమి నేతలను సంప్రదిస్తున్నదని కూడా జయేంద్రవివరించారు.

వివాదరహిత స్థలంలో శిలన్యాసానికి అనుమతిస్తేవివాదాస్పద స్థలంలో ఎటువంటి నిర్మాణం చేపట్టమంటూవిశ్వహిందూ పరిషత్‌ తనకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందన్నారు. మార్చి 15లోగా ఈ సమస్యకు ఒక పరిష్కారం సాధిస్తామని జయేంద్ర ధీమా వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X