ప్రత్యూషకేసుపై చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్షించారు. ప్రత్యూష కేర్ ఆస్పత్రిలో అనుమానాస్పద స్థితి మధ్య కన్నుమూసి పది రోజులు దాటింది. ఈ కేసులో ప్రముఖుల తనయుల ప్రమేయం వుందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. సంచలనాత్మకమైన ఈ వ్యవహారం త్వరలో అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం వుంది. 314నిబంధన కింది స్పీకర్ ప్రత్యూష వ్యవహారాన్ని చర్చకు అనుమతించే అవకాశం వుంది. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసు పూర్వాపరాలను పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.












Click it and Unblock the Notifications
