భారత-పాక్ మధ్య అణుయుద్ధ ప్రమాదం
వాషింగ్టన్ః భారత పాకిస్తాన్ ల మధ్య యుద్ధం జరిగితే అది చివరకు అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం వున్నదని సిఐఎ డైరెక్టర్ జార్జి టెనెట్ హెచ్చరించారు. భారత పాకిస్తాన్ దేశాల మధ్య 1971 నుంచి యుద్ధ అవకాశాలు మెండుగా వున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 1971తరువాత ఏ క్షణంలోనైనా ఆ రెండు దేశాలు తలపడే ప్రమాదం వుందనిసెనేట్ ఆర్మ్ డ్ సర్వీసెస్ సంఘం సమక్షంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు. పాక్స్వాధీనంలో వున్న కాశ్మీర్ పై భారత్ దాడికి దిగినా పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications
