వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మభూమినిపేకాటతో పోలుస్తారా?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉగ్రవాద హింస తీరు మారుతున్న ప్రస్తుత నేపథ్యంలో మద్రాసాలపై నిఘాపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగర రావు చెప్పారు. కొన్ని మదర్సాలను జాతీయ వ్యతిరేక శక్తులు వాడుకుంటున్న నేపథ్యంలో ఆ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన శనివారంవిలేకరులతో చెప్పారు.

ఎన్‌డిఎ ప్రభుత్వం మదర్సాల వ్యవస్థనే వ్యతిరేకిస్తున్నదనే వార్తలను ప్రస్తావించగా అటువంటి సంస్థలపై, ముఖ్యంగా అనుమానాలకు గురవుతున్న సరిహద్దుల్లోని సంస్థలపై గట్టి నిఘా అవసరమని ఆయన అన్నారు.సైన్స్‌, మాథమెటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, తదితన సబ్జెక్టులను ప్రవేశపెట్టడం ద్వారా మదర్సాలను ఆధునీకరించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఈ అవకాశాన్ని ముస్లిం నేతలు వాడుకోవడం మంచిదని ఆయన చెప్పారు.

రాష్ట్రాలు గట్టి నిఘా వేస్తే తప్ప మదర్సాల కార్యకలాపాల గురించి గానీ, వాటికి వస్తున్న నిధుల వినియోగం గురించి గానీ కేంద్రానికి తెలిసే అవకాశం లేదని ఆయన అన్నారు. భారత ముస్లింల, సంస్థల సంప్రదాయాలను, ఆచారాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X