గుంటూరు: అంతర్జాతీయ నేరస్థుల ముఠాకు చెందిన నలుగురు దొంగలు మంగళవారం పోలీసుల చేతిలో హతమయ్యారు. నలుగురు దొంగలను గుంటూరు జిల్లాలో పోలీసులు కాల్చి చంపారు.
పోలీసుల కథనం ప్రకారం- మూడు నెలల క్రితంఅరెస్టయిన నలుగురు దొంగలను పోలీసులు సత్తెనపల్లి నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సమయంలో దొంగలు ఇన్స్పెక్టర్ వద్ద గల ఆయుధాన్ని లాక్కుని బెదిరిస్తూ పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు దొంగలు హతమయ్యారు. ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.