సుప్రీంకు చేరిన రాష్ట్రపతి నివేదిక

న్యూఢిల్లీః గుజరాత్‌ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘంతీసుకున్న సంచలనాత్మక నిర్ణయం వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వ్యవహారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కు నివేదించింది. ఆయన ఆ నివేదికను పరిశీలించి మూడుఅంశాలపై సుప్రీంకోర్టు సలహా కోరారు. ఇటువంటి సమయాల్లో రాష్ట్రపతి పాత్ర ఎంతవరకు వుంటుందనేవిషయాన్ని కూడా కలాం సుప్రీంకోర్టును కోరారు.

ఈ నివేదిక సుప్రీంకోర్టుకు చేరిందని, న్యాయమూర్తులు ఆ నివేదికను పరిశీలించి ధర్మాసనం ఏర్పాటు చేస్తారని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ చెప్పారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నదనేఅంశం ఆసక్తికరంగా మారింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+