వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజమండ్రిలో పుష్కరాలపైవివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: గోదావరి పుష్కరాలను ఈ సారి ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.అందుకోసం కోటి రూపాయలను తొలివిడతగా విడుదల చేసింది. అయితే, ఈ సారి పుష్కరాలకు సంబంధించిన పనులువివాదంగా మారాయి. రాజమండ్రిలోని గోదావరి నదీ ఒడ్డున ఉండే మార్కెండేయ దేవాలయం దశాబ్దాలుగా పుష్కరాలకు వేదికగా ఉంటూ వస్తోంది.

ఈ సారి కూడా ఈ దేవాలయాన్ని వేదికకు అనువుగా మార్చాలని ప్రభుత్వం భావించి పనులు చేపట్టింది. గుడిలో మరమ్మత్తులు చేపట్టింది. కానీ ప్రభుత్వం ఈ గుడినికూల్చివేయాలని ప్రయత్నిస్తోందని రాజమండ్రికి చెందిన పలువురు నేతలు,అర్చకులు వాదిస్తున్నారు.

ఆదివారం మరమ్మత్తు పనులు చేపట్టేందుకు ప్రయత్నించిన అధికారులను వారు అడ్డుకున్నారు.గుడిలోకి వర్షపు నీరు వస్తుందని చెప్పి గుడిని కూల్చే ప్రయత్నిస్తున్నారనిపీసీసీ ప్రతినిధి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు.

ఆయన నేతృత్వంలో కొంతమంది నాయకులు,అర్చకులు ముఖ్యమంత్రికి ఆదివారం ఫ్యాక్స్‌ మెసెజ్‌పంపారు. ఆలయాన్ని కూల్చివేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X