అప్పగింతకు సిద్ధమే, కానీ..: షిండే
Posted on 24-11-03
ముంబాయి: నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కి అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తాము వ్యతిరేకం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే అన్నారు. అయితే ఈ నిర్ణయం ముంబాయి హైకోర్టు వెలువరించాలని ఆయన సోమవారం అభిప్రాయపడ్డారు.
స్టాంపుల కుంభకోణంపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కేంద్రం నిర్ణయించిందని, ఈ నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నదని,అందువల్ల అంతిమ నిర్ణయాన్ని ముంబాయి హైకోర్టు ప్రకటించాల్సి వుంటుందని ఆయనవిలేకరులతో అన్నారు. తమను కోరితే తమ వైఖరిని స్పష్టంగా ఈ నెల 27వ తేదీన కోర్టు ముందువివరిస్తామని ఆయన చెప్పారు. స్టాంపుల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేంద్రం భావిస్తోంది. అయితే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలుఅందుకు సిద్ధంగా లేదు. దీంతో ఇదంతా వివాదంగా మారింది.