వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పగింతకు సిద్ధమే, కానీ..: షిండే

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 24-11-03

ముంబాయి: నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కి అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తాము వ్యతిరేకం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. అయితే ఈ నిర్ణయం ముంబాయి హైకోర్టు వెలువరించాలని ఆయన సోమవారం అభిప్రాయపడ్డారు.

స్టాంపుల కుంభకోణంపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కేంద్రం నిర్ణయించిందని, ఈ నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నదని,అందువల్ల అంతిమ నిర్ణయాన్ని ముంబాయి హైకోర్టు ప్రకటించాల్సి వుంటుందని ఆయనవిలేకరులతో అన్నారు. తమను కోరితే తమ వైఖరిని స్పష్టంగా ఈ నెల 27వ తేదీన కోర్టు ముందువివరిస్తామని ఆయన చెప్పారు. స్టాంపుల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కేంద్రం భావిస్తోంది. అయితే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలుఅందుకు సిద్ధంగా లేదు. దీంతో ఇదంతా వివాదంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X