ముఖ్యమంత్రివైఎస్ అనంత వాగ్దానాలు
అనంతపురం: కాంగ్రెస్ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపనులను ఓర్వలేక తెలుగుదేశంపార్టీ అర్ధంపర్ధం లేని ఆరోపణలుచేస్తోందని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్రాజశేఖరరెడ్డి ఆదివారం విమర్శించారు.రాజీవ్ నగర బాట కార్యక్రమంలోభాగంగా ఆయన అనంతపురం జిల్లాపట్టణాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లోపాల్గొన్నారు. తాడిపత్రి పట్టణంలోవందకోట్ల రూపాయల వ్యయంతోనిర్మించనున్న ఆటోనగర్కు ఆయనశంకుస్ధాపన చేశారు. పంటల భీమాపథకానికి గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలనికేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికిప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.అనంతపురం జిల్లాలో మేఘమధనంకార్యక్రమానికి అనుబంధంగా రాడార్వ్యవస్ధను త్వరలో ఏర్పాటు చేస్తామనిఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేస్తామన్నారు. ముఖ్యమంత్రిఅనంతపురం జిల్లా పర్యటనలోనీటిపారుదల శాఖ మంత్రి పొన్నాలలక్ష్మయ్య, పంచాయితీరాజ్ శాఖ మంత్రిజెసి దివాకరరెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
