వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్ జిల్లాలో ప్రమాదం: ఐదుగురు మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగనూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాన్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యాన్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Story first published: Friday, March 25, 2005, 23:53 [IST]