కెసిఆర్వి అనుచిత వ్యాఖ్యలు: రోశయ్య
హైదరాబాద్: పెనుకొండ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగనుంది. పటిష్ఠమైన పోలీసు బందోబస్తు నడుమ ఓట్లను లెక్కిస్త్తారు. పెద్ద సంఖ్యలో సి. ఆర్. పి. ఎఫ్, పోలీసు బలగాలను మోహరించి ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాంతో ఎంతో కాలం తర్వాత ఈ నియోజకవర్గం ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు. ఎన్నికల బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, టిడిపి అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. హత్యకు గురైన పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీతను అభ్యర్థిగా తెలుగుదేశం నిలబెట్టగా ఫ్యాక్షన్ నేత మద్దెలచెర్వు సూరి భార్య భానుమతికి టికెట్ నిరాకరించి స్థానిక సర్పంచ్ శ్రీరాములుకు కాంగ్రెస్ టి కెట్ ఇచ్చింది. దీంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెల కొంది. 71 శాతం ఓట్లు పోలవడంతో తమకు విజయావకాశాలున్నాయని తెలుగుదేశం భావిస్తుండగా, కాంగ్రెస్ పార్టీలో ఆశలు సన్నగిల్లాయి.