పరిటాల కేసు: నిందితుల రిమాండ్ పొడిగింపు
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరితో పాటు 11 మందికి వచ్చే నెల 7వ తేదీ వరకు జ్యుడిష్యల్ రిమాండ్ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారి జ్యుడిష్యల్ రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు వారిని గురువారం కోర్టులో హాజరు పరిచారు. కాగా, ఈ కేసులోని 9 మంది నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై కోర్టు 8వ తేదీన విచారణ చేపట్టనుంది.
సూరిని మరో జైలుకు పంపించాలన్న వాదనను ఆయన తరఫు న్యాయవాది వ్యతిరేకిస్తున్నారు. సూరికి భద్రత కల్పించలేమని అంటూ సూరిని అనంతపురం జైలు నుంచి మరో జైలుకు తరలించాలని జైలు సూపరింటిండెంట్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు వచ్చే నెల 5వ తేదీన విచారణ జరుపుతుంది. సూరి అనంతపురం జైలులో ఉంటేనే వాయిదాలకు హాజరు కావడం సులభం అవుతుందని ఆయన తరఫు న్యాయవాది అంటున్నారు.