బీహార్ ఎన్నికలపైఎన్నికల కమిషన్ సీరియస్
న్యూఢిల్లీ: బీహార్లోనవంబరులో జరిగే అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగాజరగటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణంచర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్ శనివారంఆదేశం జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగాజులై 1 నుంచి ప్రారంభించి ఇప్పటిదాకా పోలీసుయంత్రాంగం చేపట్టిన చర్యల గురించిశుక్రవారం ఇసి సమీక్షించింది. కేవలం11,127 వారెంట్లను మాత్రమే పోలీసులు అమలుపరిచారనిమరో 23,616 నాన్బెయిలెబుల్ వారెంట్లనుపెండింగ్లో పెట్టారని ఆందోళన వ్యక్తంచేసింది. అక్రమ ఆయుధాలు, మందుగుండుసామగ్రిని తక్కువ మొత్తంలో స్వాధీనంచేసుకున్నారని ఆక్షేపించింది. శాంతి భద్రతలపరిస్థితుల గురించి జులై 18న డిజిపి ఎ. ఆర్.సిన్హాతో ఎన్నికల కమిషన్ సమావేశమైంది.ఎన్నికల అక్రమాలకు పాల్పడినందుకు ఎఫ్.ఐ. ఆర్లు నమోదైన వారి పేర్లను జిల్లాలవారీగా తయారుచేసి సిద్ధంగా ఉంచాలనిరాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.