వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వాయిదా
హైదరాబాద్: విద్య, ఉద్యోగాల్లో ముస్లిమ్లకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ముస్లిం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం వాదోపవాదాలు ముగిశాయి. అనంతరం హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.
మత ప్రాతిపదికపై ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని, ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాదాపు 20 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాజీవ్ ధావన్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించడం సమంజసమేనని ఆయన వాదించారు.
Comments
Story first published: Tuesday, August 2, 2005, 23:53 [IST]