పార్లమెంటుపై దాడి కేసు: అఫ్జల్కు మరణశిక్ష
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో మహ్మద్ అఫ్జల్కు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. షౌకత్ గురుకు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. షౌకత్కు గురుకు హైకోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుట్రలో భాగం మాత్రమే పంచుకున్నాడని భావించి షౌకత్గురుకు సుప్రీంకోర్టు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ప్రొఫెసర్ గిలానీ, అఫ్సాన్ గురులను నిర్దోషులుగా విడుదల చేసింది.
ప్రొఫెసర్ గిలాని, షౌకత్ గురు భార్య అఫ్సాన్ గురులను కేసు నుంచి విముక్తి కలిగిస్తూ ఢిల్లీ హైకోర్టు ప్రకటించిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సుప్రీంకోర్టు గురువారం ఈ తీర్పును వెలువరించింది. సౌకత్, అఫ్జల్లతో గిలానీ సంబంధాలపై అనుమానాలు కలుగుతున్న మాట నిజమేనని, అయితే శిక్ష వేయడానికి అనుమానం ఒక్కటే సరిపోదని, సరైన సాక్ష్యాధారాలు అవసరమని సుప్రీంకోర్టు అన్నది.
పార్లమెంటుపై 2001 డిసెంబర్ 13వ తేదీన ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.