వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యమదొంగ ప్రింట్లను ఎత్తుకెళ్లిన చిరు ఫ్యాన్స్

By Staff
|
Google Oneindia TeluguNews


అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ప్రింట్లు ఎత్తుకెళ్లారు. అమలాపురంలోని రమా థియేటరుపై చిరంజీవి అభిమానులు దాడి చేసి ఆ చర్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రమా థియేటరుపై దాడికి నిరసనగా అమలాపురంలో థియేటర్లను మూసివేశారు.

చిరంజీవి తనయుడు రామచరణ్ తేజ నటించిన చిరుత ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ స్థితిలో యమదొంగ సినిమా ప్రింట్ల అపహరణ ఎటు దారి తీస్తుందోననే ఆందోళన చెలరేగుతోంది. చిరుత సినిమాను చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. తండ్రి తగిన తనయుడిగా రామచరణ్ తేజ నీరాజనాలు అందుకోవాలనేది ఆయన కోరికగా కనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X