ట్రంప్ వార్నింగ్.. అస్సలు తగ్గేదే లేదన్న భారత్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఇరాన్లపై ఆంక్షలు విధించే చట్టంపై సంతకం చేయడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలు 100 శాతం వరకు సుంకాలను ఎదుర్కోవలసి రావచ్చు. భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. తన వైఖరిని దాదాపుగా స్పష్టం చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే అమెరికా బిల్లు ఆమోదం పొందడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. తమ 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను నిర్ధారించేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని, ఇంధనం కొనుగోలు చేయడం కొనసాగిస్తుందని పేర్కొంది.
ఈ విషయంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ చర్య అంతర్జాతీయ ఇంధన మార్కెట్పైనే కాకుండా భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొంది. యూఎస్ కాంగ్రెస్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ విషయంలో తదుపరి పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో రష్యా నుంచి భారతదేశం చేసే ముడి చమురు కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి.

అమెరికా ప్రతినిధుల సభ 'లిండ్సే ఓ. గ్రాహం ఆంక్షల చట్టం'ఆమోదించిన తరుణంలో భారత్ ఈ ప్రకటన చేసింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు శిక్షాత్మక సుంకాలను విధించేందుకు ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అధికారం కల్పిస్తుంది. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసే దేశాలలో భారత్, చైనా కూడా ఉన్నాయి. ఈ చర్య వల్ల ఆ దేశాలు ప్రభావితం కావచ్చు. ఉన్నత స్థాయిలో అమెరికాతో తమ ఆందోళనలను భారత్ ఇప్పటికే ప్రస్తావించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. అమెరికా చర్య వల్ల కలిగే పరిణామాలను భారత్ ఎత్తి చూపడం ఇది మొదటిసారి కాదని స్పష్టమవుతోంది. ఈసారి ఈ సమస్య చమురు కొనుగోళ్లపై విభేదాలకు మించిపోయినట్లు కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications
