వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో నలుగురు మావోయిస్టుల హతం

By Staff
|
Google Oneindia TeluguNews


విశాఖపట్నం: విశాఖపట్నం జి. మాడుగుల అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య బుధవారంనాడు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. ఇరు పక్షాలకు మధ్య చాలా సేపు ఎదురుకాల్పులు జరిగాయి. మరణించినవారిలో ముగ్గురు మహిళ నక్సలైట్లు ఉన్నట్లు జిల్లా ఎస్పీ చెప్పారు.

సంఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు 303 రైఫిళ్లు, ఒక తపంచా, ఇతర ఆయుధాలు లభ్యమయ్యాయి. విశాఖపట్నం జిల్లా చింతపల్లి ప్రాంతంలో పోలీసులు బుధవారంనాడు మావోయిస్టులు అమర్చిన మూడు మందుపాతరలను వెలికి తీశారు. వాటిని నిర్వీర్యం చేశారు. మరిన్ని మందుపాతరలు అమర్చి ఉంటారనే అనుమానంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X