వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews


Chandrababu అనంతపురం: కాంగ్రెసుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం తన అనంతపురం జిల్లా పర్యటనలో దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. బెంగుళూర్ నుంచి ఆయన హెలికాప్టరులో అనంతపురం చేరుకున్నారు. అనంతరం ఆయన యాత్ర మడకశిర వరకు సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

తాము చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఫలితాలు సాధించాయని, అయితే ఆ ఫలితాలు పేదలకు, రైతులకు అందడం లేదని ఆయన అన్నారు. అంతకు ముందు ఆయన హేమావతి శివాలయంలో పూజలు నిర్వహించారు. రైతులను, గొర్రెల కాపరులను ఆయన పరామర్శించారు. రెండు రోజుల పాటు ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X