వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిర, సోనియాలను వలస పక్షులనలేదు: కిరణ్

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: ఇందిరా గాంధీని, సోనియాగాంధీని తాను వలసపక్షులు అని అనలేదని కాంగ్రెస్ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను అన్నదాన్ని మీడియా వక్రీకరించారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాను చెప్పిన విషయాలను పూర్తిగా రాయకుండా వక్రీకరించారని ఆయన అన్నారు. తాను ఇందిర, సోనియాలను వలసపక్షులు అని అనలేదని, ఒకవేళ అని ఉంటే క్షమాపణ చెప్పడానికి వెనకాడబోనని ఆయన అన్నారు.

ఇందిర, సోనియాలను వలసపక్షులు అని అన్నందుకు క్షమాపణ చెప్పాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి నిరంజన్ కిరణ్ కుమార్ రెడ్డికి ఒక లేఖ రాశారు. కిరణ్ కుమార్ రెడ్డి అలా అనడం ద్వారా పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తీశారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X