వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా ఖైదీ మృతి: కామాక్షిపై దాడి

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: హైదరాబాదులోని నయాపూల్ జజ్జికానా అస్పత్రిలో జకీరా బేగం అనే మహిళా ఖైదీ మరణించింది. రిమాండ్ ఖైదీగా అమె చంచల్ గుడా జైలులో ఉంటోంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను జజ్జికానా అస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె మరణించిందని ఆరోపిస్తూ అస్పత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

జకీరా బేగం బంధువులు నయాపూల్ అస్పత్రి జూనియర్ డాక్టర్ కామాక్షిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. జకీరా నాలుగు నెలల గర్భవతి. ఈ నెల 10వ తేదీన కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చేర్చారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం మరణించింది. ఆరోగ్య మంత్రి వచ్చే వరకు తాము శవాన్ని తీసుకెళ్లబోమని శాసనసభ్యుడు పాషా ఖాద్రీ అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X