వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనీషా హత్య కేసులో మలుపు

By Staff
|
Google Oneindia TeluguNews


వరంగల్: వరంగల్లులోని కాశీబుగ్గలో కిడ్నాపయి హత్యకు గురైన మనీషా కేసు కొత్త మలుపు తిరిగింది. మనీషాను దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. 12 ఏళ్ల మనిషా శవం తాడ్వాయి మండలం తాటికాయలపాలెంలోని ఒక బావిలో లభించింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు ప్రజాప్రతిఘటన నక్సలైట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతిఘటన నక్సలైట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు.

ఓ డంప్ వివాదమే మనీషా హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. మనీషా తండ్రికి ప్రజాప్రతిఘటన నక్సలైట్లతో సంబంధాలుండేవని, వారి డంప్ ఒకటి అతనికి దొరికిందని, అందులోని 50 లక్షల రూపాయలు అతనికి లభించాయని అంటున్నారు. ఆ డబ్బు నక్సల్స్ కు ఇవ్వడానికి అతను నిరాకరించాడని అంటున్నారు. దాంతో వారు మనీషాను కిడ్నాప్ చేసి హత్య చేశారని అంటున్నారు. తమకు మనీషా కిడ్నాప్ తో ఏ సంబంధం లేదని ప్రజాప్రతిఘటన మూడు జిల్లాల కార్యదర్శి సురేష్ ప్రకటించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X