మనీషా హత్య కేసులో మలుపు
వరంగల్:
వరంగల్లులోని
కాశీబుగ్గలో
కిడ్నాపయి
హత్యకు
గురైన
మనీషా
కేసు
కొత్త
మలుపు
తిరిగింది.
మనీషాను
దుండగులు
కిడ్నాప్
చేసి
హత్య
చేసిన
విషయం
తెలిసిందే.
12
ఏళ్ల
మనిషా
శవం
తాడ్వాయి
మండలం
తాటికాయలపాలెంలోని
ఒక
బావిలో
లభించింది.
ఈ
కేసులో
పోలీసులు
ఇద్దరు
ప్రజాప్రతిఘటన
నక్సలైట్లను
పోలీసులు
అదుపులోకి
తీసుకుని
ప్రశ్నిస్తున్నట్లు
సమాచారం.
ప్రజాప్రతిఘటన
నక్సలైట్లను
అదుపులోకి
తీసుకుని
ప్రశ్నిస్తున్న
విషయాన్ని
పోలీసులు
ధృవీకరించడం
లేదు.
ఓ
డంప్
వివాదమే
మనీషా
హత్యకు
దారి
తీసినట్లు
తెలుస్తోంది.
మనీషా
తండ్రికి
ప్రజాప్రతిఘటన
నక్సలైట్లతో
సంబంధాలుండేవని,
వారి
డంప్
ఒకటి
అతనికి
దొరికిందని,
అందులోని
50
లక్షల
రూపాయలు
అతనికి
లభించాయని
అంటున్నారు.
ఆ
డబ్బు
నక్సల్స్
కు
ఇవ్వడానికి
అతను
నిరాకరించాడని
అంటున్నారు.
దాంతో
వారు
మనీషాను
కిడ్నాప్
చేసి
హత్య
చేశారని
అంటున్నారు.
తమకు
మనీషా
కిడ్నాప్
తో
ఏ
సంబంధం
లేదని
ప్రజాప్రతిఘటన
మూడు
జిల్లాల
కార్యదర్శి
సురేష్
ప్రకటించాడు.