అల్పపీడన ద్రోణితో వర్షాలు
హైదరాబాద్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది. తెలంగాణాలోనూ చెదురుమొదురు జల్లులు పడొచ్చని తెలిపింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుల తీరంపై ఆవరించిన నేపథ్యంలో గత రెండు రోజులుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. పసిఫిక్ మహాసముద్రం నుంచి ఈస్టర్లీ వేవ్స్గా పిలిచే గాలి అలల ప్రభావం కారణంగా ఇలా వేసవికాలంలో వర్షాలు పడుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉష్ణోగ్రత కూడా తగ్గుముఖం పడుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications